ఐస్‌క్రీమ్‌ల్లోనూ కరోనా ఆనవాళ్లు.. చైనాలో మళ్లీ కలకలం

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (12:54 IST)
చైనా వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ అక్కడ తయారైన ఐస్‌క్రీమ్‌ల్లోనూ కరోనా ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆ బ్యాచ్లో ఉత్పత్తి అయిన వేల ఐస్క్రీం కార్టన్లను వెనక్కి తీసుకుంటోంది సంస్థ.
 
బీజింగ్‌కు సమీపాన ఉన్న తియాన్జిన్లోని డాకియావొడావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాచ్లో మొత్తం 29 వేల కార్టన్లు ఇంకా విక్రయించలేదని స్థానిక ప్రభుత్వాధికారులు తెలిపారు. 390 కార్టన్లు తియాన్జిన్లో అమ్మినట్లు వెల్లడించారు. వీటి అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయో కనిపెట్టే పనిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
 
అయితే ఐస్క్రీంల వల్ల ఎవరైనా కరోనా బారినపడ్డారో లేదో తెలియలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంస్థను సీజ్ చేసి, అందులోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, చైనాలో ఆదివారం 109 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో 72 కేసులు హెబే ప్రావిన్స్లోనే వెలుగుచూశాయి. ఇక్కడే చైనా ప్రభుత్వం భారీ ఐసోలేషన్ ఆస్పత్రిని నిర్మిస్తోంది. దేశంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: బండి భగీరథ్‌ పై పోక్సో కేసు తీవ్రంగా కలవరపరిచింది : మంచు మనోజ్

విజయ్ జీవితంలోకి కొందరు పరాన్నా జీవులుగా ప్రవేశించారు : సుచిత్ర

Ali: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

Nihal: వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సందిగ్ధం డేట్ ఫిక్స్

Varun Sandesh : నా వైఫ్ మిస్సింగ్ అంటోన్న వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments