వంద సంఖ్యకు దిగువకు చేరుకున్న కరోనా మరణాలు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (12:32 IST)
దేశంలో కరోనా మరణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. మంగళవారం లెక్కల ప్రకారం ఈ వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య కేవలం 94 మాత్రమే. ఇది భారత్ పెద్ద ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
అలాగే రోజువారీ కేసుల 10వేలలోపునకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 94 మరణాల సంభవించగా.. 8,635 కొత్త కేసులు వెలుగుచూశాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
దీంతో ఇప్పటివరకు 1,07,66,245 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,54,486కి చేరింది. ఎనిమిది నెలల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదకావడం ఇదే తొలిసారి. 
 
ఇకపోతే, కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి శాతం 97కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 13,423 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోటీ నాలుగు లక్షల మందికి పైగా వైరస్‌ను జయించారు. 
 
ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో క్షీణత కొనసాగింది. దేశంలో 1,63,353 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.56 శాతానికి తగ్గింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. నిన్న వైద్య సిబ్బంది 6,59,422 మంది నమూనాలను పరీక్షించారు.  
 
ఇంకోవైపు, జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వరకు 39,50,156 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 1,91,313 మంది టీకా వేయించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

PrakashRaj: ధురంధర్-2 పై ప్రకాష్ రాజ్ విమర్శ - రామ్ గోపాల్ వర్మ ప్రశంస

మా ప్రేయసిరావే రేంజ్‌లో పిఠాపురంలో... హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments