Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ విస్ఫోటనం - 3 లక్షల పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:27 IST)
దేశంలో కరోనా వైరస్ విస్ఫోటనం సంభవించినట్టుగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా మూడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడమే దీనికి నిదర్శనం. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,94,115 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, కరోనాతో 2,023 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,56,16,130కి కరోనా కేసులు చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 21,57,538 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి 1,33,76,039 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 1,82,553 మంది మృతి చెందినట్లు బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంట‌ల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల మ‌ధ్య  6,542 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 2,887 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,67,901కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,19,537 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,876గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 46,488 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 898 మందికి క‌రోనా సోకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments