Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ముంబైలో తొలి కోవిడ్-19 ఆస్పత్రి

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (18:57 IST)
కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రంగంలోకి దిగి.. భారత దేశంలో తొలి ఆస్పత్రిని సిద్ధం చేసింది. భారత దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్-19 పేషెంట్ల కోసం ముంబైలో ఆస్పత్రిని ఆర్ఐఎల్ ఏర్పాటు చేసింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో సర్ హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కోవిడ్ 19 ఆస్పత్రిని నిర్మించింది. 
 
ఈ ఆస్పత్రికి కావాల్సిన నిధుల్ని రిలయెన్స్ ఫౌండేషన్ సమకూర్చింది. ముంబైలోని సెవెన్ హిల్స్‌లో 100 పడకలతో కూడుకున్నదని ఆర్ఐఎల్ స్పష్టం చేసింది. ఈ ఆస్పత్రిలో 100 బెడ్స్‌కి కావాల్సిన వెంటిలేటర్స్, పేస్‌మేకర్స్, డయాలిసిస్ మెషీన్, పేషెంట్ మానిటరింగ్ డివైజ్‌లు ఉన్నాయి. ఇక సర్ హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో క్వారెంటైన ట్రావెలర్స్‌కి ప్రత్యేకమైన సదుపాయాలున్నాయి. 
 
ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్ ఏర్పాట్లున్నాయి. పరస్పరం కలుషితం కాకుండా, ఇన్ఫెక్షన్‌ని కంట్రోల్ చేసేందుకు నెగిటీవ్ ప్రెజర్ రూమ్ కూడా ఈ ఆస్పత్రిలో వుంది. ఈ ఆస్పత్రిలో కరోనా వైరస్ పాజిటీవ్ పేషెంట్లకు చికిత్స అందిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments