Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై యుద్ధం : సత్య నాదెళ్ల అర్థాంగి భారీ విరాళం.. హీరో నితిన్ కూడా

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (17:58 IST)
ప్రపంచం కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుంది. ఈ వైరస్ భూతం ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఈ వైరస్ కోరల్లో అగ్రరాజ్యాలు చిక్కుకున్నాయి. అన్ని దేశాలు కలిసి ఈ వైరస్‌పై అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం యుద్ధం చేస్తోంది. అయినప్పటికీ.. ఇప్పటివరకు సరైన మందును కనిపెట్టలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్థాంగి అనుపమ భారీ విరాళంతో ముందుకొచ్చారు. కరోనా నివారణకు అనుపమ రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని అనుపమ తండ్రి తెలంగాణ సీఎం సహాయనిధికి అందించారు. ఈ మొత్తాన్ని అనుపమ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ సీఎంకు అందజేశారు.
 
అలాగే, టాలీవుడ్ హీరో నితిన్ కూడా తనవంతు సాయం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ నియంత్రణకు తన వంతు భాగస్వామ్యం కింద ఆయా రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళంగా హీరో నితిన్ ప్రకటించారు. ఈ చెక్కును ఆయన స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. 
 
తెలంగాణ ఉద్యోగులు, టీచర్ల ఒక రోజు బేసిక్ శాలరీని విరాళం కింద ఇచ్చారు. విరాళాలు అందజేసిన వారికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments