Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై యుద్ధం : సత్య నాదెళ్ల అర్థాంగి భారీ విరాళం.. హీరో నితిన్ కూడా

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (17:58 IST)
ప్రపంచం కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుంది. ఈ వైరస్ భూతం ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఈ వైరస్ కోరల్లో అగ్రరాజ్యాలు చిక్కుకున్నాయి. అన్ని దేశాలు కలిసి ఈ వైరస్‌పై అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం యుద్ధం చేస్తోంది. అయినప్పటికీ.. ఇప్పటివరకు సరైన మందును కనిపెట్టలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్థాంగి అనుపమ భారీ విరాళంతో ముందుకొచ్చారు. కరోనా నివారణకు అనుపమ రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని అనుపమ తండ్రి తెలంగాణ సీఎం సహాయనిధికి అందించారు. ఈ మొత్తాన్ని అనుపమ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ సీఎంకు అందజేశారు.
 
అలాగే, టాలీవుడ్ హీరో నితిన్ కూడా తనవంతు సాయం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ నియంత్రణకు తన వంతు భాగస్వామ్యం కింద ఆయా రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళంగా హీరో నితిన్ ప్రకటించారు. ఈ చెక్కును ఆయన స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. 
 
తెలంగాణ ఉద్యోగులు, టీచర్ల ఒక రోజు బేసిక్ శాలరీని విరాళం కింద ఇచ్చారు. విరాళాలు అందజేసిన వారికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments