Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా హైరానా : మరో 3 వేల కేసులు - తెలంగాణాలో మళ్లీ వేగం

Webdunia
బుధవారం, 13 మే 2020 (10:26 IST)
దేశంలో కరోనా వైరస్ హైరానా ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా మరో 3 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,415కి చేరింది.
 
ఇక గత 24 గంటల్లో దేశంలో 3,525 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 74,281కి చేరింది. అలాగే, కరోనా నుంచి 24,386  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 47,480 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విశ్వరూపాన్ని చూపుతున్నాయి. మంగళవారం కూడా కొత్తగా 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 31 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఇపుడు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఈ 31 మందిలో 14 మంది వలస కూలీలు ఉన్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో 1326 కరోనా కేసులు నమోదైవుండగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 32 మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments