Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్‌లో టీచర్లకు.. తిరుమలలో వేద పాఠశాలలో కరోనా కలకలం

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (16:42 IST)
కరీంనగర్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరికి కరోనా వచ్చింది. కార్ఖానా గడ్డ హైస్కూల్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్లో మిగతా వారికి పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఐదురోజుల క్రితం వేద పాఠశాలలో కరోనా కేసులు వెలుగు చూడటంతో విద్యార్థులకు, బోధనా సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు మొత్తం 75 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవాళ కరోనా పరీక్షలు చేయించింది.
 
10 మందికి పాటివ్‌ రావడంతో వీరిని తిరుపతి స్విమ్స్‌కు తరలించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత వారం వేద పాఠశాలలో 57 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో చాలా మంది విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం వేద పాఠశాలలో 21 మంది విద్యార్థులుండగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments