Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం: ఇంట్లో నుంచి కదలని ఇటలీ ప్రధాని, మీరు కూడా రావద్దంటూ సూచన

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (13:43 IST)
రోమ్(ఇటలీ): ఇటలీ దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయంతో ఆ దేశ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటలీ దేశంలో సిరీస్ ఏతో పాటు అన్ని రకాల క్రీడల టోర్నమెంట్లను రద్దు చేస్తున్నామని ఇటలీ దేశ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే చెప్పారు. 
 
కరోనా వైరస్ ప్రబలుతున్నందున ప్రజల ప్రయోజనార్థం దేశంలోని అన్ని క్రీడల పోటీలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించారు. క్రీడల పోటీల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు గుమిగూడే అవకాశమున్నందు వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని, అందుకే అన్ని క్రీడల పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు.
 
‘‘ఇటలీ దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందు వల్ల మన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది, మన ఇటలీ దేశ ప్రయోజనాల కోసం మనం కొన్నింటిని త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను కూడా ఇంట్లోనే ఉంటున్నాను’’ అని ఇటలీ ప్రధానమంత్రి కాంటే చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments