Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏపీలో 50, తెలంగాణలో 157 కేసులు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:01 IST)
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 121 మంది చికిత్సకు కోలుకొని దవాఖాల నుంచి డిశ్చార్జి అయ్యారు. నెల్లూరు జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,605 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వైరస్‌ ప్రభావంతో నేటివరకు 7,161 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.
 
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 29,666 మందికి కరోనా పరీక్షలు చేయగా 157 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరో 163 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,988కి చేరింది. ఇప్పటివరకు కోవిడ్-19తో 1,613 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 2,92,578 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,797 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 729 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 27 కరోనా కేసులు బయటపడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments