దేశంలో 20 వేలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (10:09 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొత్త‌గా 18,132 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, ఆదివారం 21,563 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,93,478కి చేరింది. నిన్న‌ 193 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,782కి చేరింది.
 
ప్ర‌స్తుతం 2,27,347 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 95,19,84,373 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న ఒక్క‌రోజులో 10,691 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 85 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.
 
అలాగే, తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,506 కరోనా పరీక్షలు నిర్వహించగా, 162 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 11, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.  
 
అదేసమయంలో 214 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,67,887 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,722 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,235 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,930కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments