ఎవరికైనా ఫోన్ చేస్తున్నారా? కరోనా కాల్ పలకరిస్తుంది..

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (15:18 IST)
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో.. ప్రభుత్వాలు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ ఇంకా కొంతమంది సరైన జాగ్రత్తలు పాటించడంలేదు. ఈ కారణంతోనే ప్రస్తుతం మొబైల్ సర్వీస్ ఆపరేటర్లు కూడా ఈ ప్రయత్నంలో భాగం అయినట్లుగా తెలుస్తోంది. మొబైల్ ఫోనులో ఏ కాల్ వచ్చినా వారిని ముందుగా కరోనా కాల్ పలకరిస్తుంది. 
 
కాల్ చేయగానే మొదటి ఒక పొడి దగ్గు... వినిపిస్తుంది. అదేంటి మనం కాల్ చేసిన తర్వాత కనీసం రింగ్ కూడా కాలేదు అప్పుడే కాల్ లిఫ్ట్ చేశాడా అని అనిపిస్తుంది. అయితే ఆ దగ్గు మళ్లీ వెంటనే తగ్గిపోతుంది.. ఆ తర్వాత కరోనా వైరస్ గురించిన హెచ్చరికలు మొదలవుతాయి. కరోనా వైరస్ ఎలా ప్రబలుతోంది కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దగ్గు లేదా తుమ్ము తరచూ వస్తున్న వ్యక్తుల నుంచి కాస్త దూరంగా ఉండటం మేలు అనే సందేశం ఇస్తుంది. 
 
అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ఇలా కరోనా గురించి కొన్ని సలహాలు వస్తాయి. దీనిని బట్టి మనం ఎవరికీ కాల్ చేసినా కూడా మనకి ముందుగా కరోనా హెచ్చరికలు వినిపిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

తర్వాతి కథనం
Show comments