Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకి బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (08:14 IST)
కరోనా వైరస్ మహమ్మారి అనేక మంది సెలెబ్రిటీలను పొట్టనబెట్టుకుంటోంది. గత యేడాది కాలంగా ఈ మరణమృదంగం కొనసాగుతూనే వుంది. ఇందులో అనేక మంది సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌ు కూడా ఉన్నారు. తాజ‌గా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్(66) కరోనాతో క‌న్నుమూశారు.
 
దిగ్గజ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన శ్రావణ్ రాథోడ్‌కు (నదీమ్‌ - శ్రావణ్ ) కొద్ది రోజుల క్రితం క‌రోనా సోక‌గా, ఆయ‌నకు ముంబైలోని ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తూ వ‌చ్చారు. అయితే ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని శ్రావ‌ణ్ కుమారుడు, మ్యూజిక్ కంపోజ‌ర్ సంజీవ్ రాథోడ్ ముందు నుండి చెబుతూనే ఉన్నారు.
 
దీర్ఘకాలంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వైరస్‌ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని ఈ క్ర‌మంలోనే ఆయ‌న మృత్యువాత ప‌డ్డాడ‌ని తెలుస్తుంది. శ్రావ‌ణ్ మృతిని మ్యూజిక్ కంపోజ‌ర్ న‌దీమ్ సైఫీ క‌న్‌ఫాం చేశారు. శ్రావ‌ణ్ మృతిని జీర్ణించుకోలేని బాలీవుడ్ ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేసింది. 
 
కాగా ఆషిఖీ, సాజన్‌, పర్దే, రాజా హిందుస్తానీ సూపర్ హిట్ పాటలతో నదీమ్‌-శ్రవణ్ జోడీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. 2000 ల మధ్య కాలంలో విడిపోయిన వీరిద్దరూ తిరిగి 2009లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన డు నాట్ డిస్టర్బ్ మూవీకి కలిసి పని చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments