Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దారుణం, కరోనా వైరస్ ఉండగానే ఆసుపత్రి నుంచి పంపేసిన వైద్యులు..?

Webdunia
గురువారం, 14 మే 2020 (16:33 IST)
ఎపి పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లి గూడెం పెంటపాడుకు చెందిన ఒక యువకుడు చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతనికి కరోనా లక్షణాలు వచ్చాయి. దీంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి పాజిటివ్ వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. అయితే వైద్యులు అతడిని ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఆసుపత్రిలో చేర్పించుకున్నారు. 
 
రెండురోజులు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చి 10వ తేదీ అతడిని డిశ్చార్జ్ చేసేశారు. నెగిటివ్ వస్తేనే కదా డిశ్చార్జ్ చేయాలని యువకుడు వైద్యులను అడిగారు. అయితే వైద్యులు మాత్రం అదంతా మాకు తెలియదు. మా ఉన్నతాధికారుల ఆదేశాలంటూ తనను పంపించేసినట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. 
 
తనకు దగ్గు, జలుబు ఇంకా తగ్గలేదని, చెన్నైలోనే తనను ఆసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ చేయాలని యువకుడు ఎపి ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాడు. సెల్ఫీ వీడియో తీసి వీడియోను తన స్నేహితులకు పంపించాడు. చెన్నైలో కాకున్నా ఎపికి తీసుకువచ్చి తనకు చికిత్స చేయాలని ప్రాథేయపడుతున్నాడు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో ఇదేవిధంగా అందరినీ పంపించేస్తున్నారని, పాజిటివ్ ఉండగానే అందరినీ పంపిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నాడు యువకుడు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments