Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దారుణం, కరోనా వైరస్ ఉండగానే ఆసుపత్రి నుంచి పంపేసిన వైద్యులు..?

Webdunia
గురువారం, 14 మే 2020 (16:33 IST)
ఎపి పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లి గూడెం పెంటపాడుకు చెందిన ఒక యువకుడు చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతనికి కరోనా లక్షణాలు వచ్చాయి. దీంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి పాజిటివ్ వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. అయితే వైద్యులు అతడిని ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఆసుపత్రిలో చేర్పించుకున్నారు. 
 
రెండురోజులు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చి 10వ తేదీ అతడిని డిశ్చార్జ్ చేసేశారు. నెగిటివ్ వస్తేనే కదా డిశ్చార్జ్ చేయాలని యువకుడు వైద్యులను అడిగారు. అయితే వైద్యులు మాత్రం అదంతా మాకు తెలియదు. మా ఉన్నతాధికారుల ఆదేశాలంటూ తనను పంపించేసినట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. 
 
తనకు దగ్గు, జలుబు ఇంకా తగ్గలేదని, చెన్నైలోనే తనను ఆసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ చేయాలని యువకుడు ఎపి ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాడు. సెల్ఫీ వీడియో తీసి వీడియోను తన స్నేహితులకు పంపించాడు. చెన్నైలో కాకున్నా ఎపికి తీసుకువచ్చి తనకు చికిత్స చేయాలని ప్రాథేయపడుతున్నాడు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో ఇదేవిధంగా అందరినీ పంపించేస్తున్నారని, పాజిటివ్ ఉండగానే అందరినీ పంపిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నాడు యువకుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments