డెల్టా ప్లస్ వైరస్‌ చాలా ప్రమాదకారి : రామన్ గంగఖేడ్కర్

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (19:43 IST)
ప్రజలను కరోనా వైరస్ భయపెడుతోంది. ఇపుడు డెల్టా వైరస్ కొత్తగా వచ్చింది. ఇది కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకారిగా అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగఖేడ్కర్ స్పందించారు. 
 
కొత్తగా ఉనికిలోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఆందోళనకర వైరస్‌గా పరిగణించాలని కోరారు. డెల్టా కంటే డెల్టా ప్లస్ వ్యాప్తి అధికమని చెప్పేందుకు ఆధారాలేవీ లేకపోయినప్పటికీ.. దీన్ని ఆందోళనకారకంగా గుర్తించాలన్నారు. 
 
అధికారిక సమాచారం ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ 50కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలో ఈ తరహా కేసులు అధిక సంఖ్యలో నమోదవగా.. పంజాబ్, జమ్ముకాశ్మీర్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోనూ ఈ వైరస్ అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. 
 
కాగా.. డెల్టా ప్లస్ విషయమై ఐసీఎమ్ఆర్ అంటువ్యాధుల విభాగం చీఫ్ డా. సమీరన్ పండా కూడా స్పందించారు. ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు ఇప్పటివరకూ పది రాష్ట్రాల్లో వెలుగు చూసినప్పటికీ ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సంకేతం కాదని స్పష్టం చేశారు. ఇలా భావించడమంటే.. తప్పుదారి పట్టడమేనని వ్యాఖ్యానించారు. థర్డ్ వేవ్ తీవ్రత సెకెండ్ వేవ్ అంతస్థాయిలో ఉండదని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

బాలకృష్ణ గారిలా తొడగట్టి K-ర్యాంప్ విజయం అని చెప్పాం : రాజేశ్ దండ, శివ బొమ్మకు

Nayanatara: మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రిలీజ్

'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments