Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెల్టా ప్లస్ వైరస్‌ చాలా ప్రమాదకారి : రామన్ గంగఖేడ్కర్

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (19:43 IST)
ప్రజలను కరోనా వైరస్ భయపెడుతోంది. ఇపుడు డెల్టా వైరస్ కొత్తగా వచ్చింది. ఇది కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకారిగా అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగఖేడ్కర్ స్పందించారు. 
 
కొత్తగా ఉనికిలోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఆందోళనకర వైరస్‌గా పరిగణించాలని కోరారు. డెల్టా కంటే డెల్టా ప్లస్ వ్యాప్తి అధికమని చెప్పేందుకు ఆధారాలేవీ లేకపోయినప్పటికీ.. దీన్ని ఆందోళనకారకంగా గుర్తించాలన్నారు. 
 
అధికారిక సమాచారం ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ 50కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలో ఈ తరహా కేసులు అధిక సంఖ్యలో నమోదవగా.. పంజాబ్, జమ్ముకాశ్మీర్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోనూ ఈ వైరస్ అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. 
 
కాగా.. డెల్టా ప్లస్ విషయమై ఐసీఎమ్ఆర్ అంటువ్యాధుల విభాగం చీఫ్ డా. సమీరన్ పండా కూడా స్పందించారు. ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు ఇప్పటివరకూ పది రాష్ట్రాల్లో వెలుగు చూసినప్పటికీ ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సంకేతం కాదని స్పష్టం చేశారు. ఇలా భావించడమంటే.. తప్పుదారి పట్టడమేనని వ్యాఖ్యానించారు. థర్డ్ వేవ్ తీవ్రత సెకెండ్ వేవ్ అంతస్థాయిలో ఉండదని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments