డెల్టా ప్లస్ వైరస్‌ చాలా ప్రమాదకారి : రామన్ గంగఖేడ్కర్

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (19:43 IST)
ప్రజలను కరోనా వైరస్ భయపెడుతోంది. ఇపుడు డెల్టా వైరస్ కొత్తగా వచ్చింది. ఇది కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకారిగా అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగఖేడ్కర్ స్పందించారు. 
 
కొత్తగా ఉనికిలోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఆందోళనకర వైరస్‌గా పరిగణించాలని కోరారు. డెల్టా కంటే డెల్టా ప్లస్ వ్యాప్తి అధికమని చెప్పేందుకు ఆధారాలేవీ లేకపోయినప్పటికీ.. దీన్ని ఆందోళనకారకంగా గుర్తించాలన్నారు. 
 
అధికారిక సమాచారం ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ 50కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలో ఈ తరహా కేసులు అధిక సంఖ్యలో నమోదవగా.. పంజాబ్, జమ్ముకాశ్మీర్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోనూ ఈ వైరస్ అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. 
 
కాగా.. డెల్టా ప్లస్ విషయమై ఐసీఎమ్ఆర్ అంటువ్యాధుల విభాగం చీఫ్ డా. సమీరన్ పండా కూడా స్పందించారు. ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు ఇప్పటివరకూ పది రాష్ట్రాల్లో వెలుగు చూసినప్పటికీ ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సంకేతం కాదని స్పష్టం చేశారు. ఇలా భావించడమంటే.. తప్పుదారి పట్టడమేనని వ్యాఖ్యానించారు. థర్డ్ వేవ్ తీవ్రత సెకెండ్ వేవ్ అంతస్థాయిలో ఉండదని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments