Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లంతో కరోనావైరస్ చచ్చిపోతుందా? (Video)

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (21:38 IST)
కరోనావైరస్ దెబ్బకు ఇపుడు అల్లం, పసుపు, మిరియాలు, బెల్లం విపరీతంగా అమ్ముడవుతున్నాయి. దీనికి కారణం వీటితో కషాయం కాచుకుని తీసుకుంటే కరోనావైరస్ అడ్డుకుంటుందనే వాదన.

కానీ ఇది వాస్తవమని ఎక్కడా నిరూపించబడలేదు. అలాగే ఈ కషాయాలు తాగిన వారికి కరోనావైరస్ రాలేదని రుజువులేదు. కానీ కరోనావైరస్ సోకితే అప్పటికే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కనుక మన శరీరం కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా వుంటుందనేది కొందరి నిపుణుల మాట.
అసలు అల్లం వల్ల కరోనా వైరస్‌ చచ్చిపోతుందని ఎక్కడా చెప్పలేదు. కానీ అల్లం తీసుకోవడం వల్ల మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా కరోనా తదితర వైరస్‌లతో పోరాడే శక్తిని శరీరం కలిగి వుంటుంది. అల్లంలో ఉండే జింజెరోల్‌ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటివి దరిచేరకుండా అడ్డుకుంటుంది. విపరీతమైన దగ్గు వేధిస్తున్నప్పడు అల్లం, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని తింటే ఉమశమనం కలుగుతుంది.
 
ఆకలిలేమి, వేవిళ్లు, అజీర్తి వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు అల్లం యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అల్లం కంటే శొంఠిలో ఎక్కు ఔషధ గుణాలున్నాయి. అల్లం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదర పేగులో చేరే క్రిములను నశింపజేస్తుంది. లివర్‌ను శుభ్రపరుస్తుంది. ఆకలిలేమితో బాధపడేవారు.. అల్లం, కొత్తిమీర తరుగుతో పచ్చడి తయారుచేసుకుని తీసుకోవడం మంచిది. 
గొంతునొప్పికి అల్లం రసం మెరుగ్గా పనిచేస్తుంది. కానీ అల్లాన్ని మితంగా తీసుకోవాలి. ఇక అల్లం రసాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గుతారు. అల్లం పచ్చడి గొంతు నొప్పి, ఛాతి నొప్పిని దూరం చేస్తుంది. అల్లం రసంలో బెల్లం కలుపుకుని తాగితే వాత సమస్యలు దూరమవుతాయి. అల్లం, పుదీనా పచ్చడిని తీసుకుంటే పిత్త, అజీర్తి దూరమవుతుంది. నోటి దుర్వాసన ఉండదు. చురుగ్గా ఉంటారు. కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 




 

అల్లం తొక్కను తీసేయకుండా అలానే దంచేస్తే మాత్రం అపాయం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే? అల్లం తొక్కలో విషపదార్థాలుంటాయట. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని.. అందుకే అల్లం ఉపయోగించేటప్పుడు తొక్క తీసేయడం చాలా మంచిదని వారు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

మిలియన్ల ఆస్తి సంపాదించా, కానీ ఐ.టీ.కి దొరకను : అనిల్ రావిపూడి

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments