Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్.. రెండు గ్రూపులుగా వచ్చారు..

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (14:39 IST)
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత నెల రోజుల్లో బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి దాదాపు 3 వేల మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వారి వివరాలను రాష్ట్రానికి కేంద్రం అందించింది. వారిని రెండు భాగాలుగా విభజించారు. మొదటి రెండు వారాల్లో వచ్చిన 1,800 మంది ఒక గ్రూపు, డిసెంబర్‌ 9 నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,200 మందిని రెండో గ్రూపుగా విభజించారు. 
 
మొదటి రెండు వారాల్లో వచ్చిన 1,800 మంది వివరాలు తెలుసుకొని వారిని ఆరోగ్య సిబ్బంది పరిశీలిస్తారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలున్నాయా లేదా గుర్తిస్తారు. వారిని పరిశీలనలో మాత్రమే ఉంచుతారు. రెండో గ్రూపులో ఉన్న 1,200 మందిపై ఇప్పుడు వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. 
 
వారిలో 800 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారేనని అధికారులు వెల్లడించారు. వారిని వెతికే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. వారిలో ఇప్పటివరకు 200 మందిని గుర్తించారు. వారి నుంచి నమూనాలు తీసుకొని ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, అందరికీ నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments