కోవ్యాక్సిన్‌కు ''NO'' చెప్పిన బ్రెజిల్.. వివరణ ఇచ్చిన భారత్ బయోటెక్?!

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (20:39 IST)
కరోనా వ్యాక్సిన్‌ను వివిధ బయో కంపెనీలు తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఫైజర్, కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వంటివి వున్నాయి. ఈ వ్యాక్సిన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దిశగా ఆయా ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాక్సిన్ టీకాను దిగుమతి చేసుకోమంటూ బ్రెజిల్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 
 
టీకా ఉత్పత్తికి సంబంధించిన పారిశ్రామిక నిబంధనలు భారత్ బయోటెక్ పాటించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. కరోనా కారణంగా అల్లాడిపోతున్న బ్రెజిల్ గతంలో రెండు మిలియన్ల కొవ్యాక్సిన్ టీకా డోసులను దిగుమతి చేసుకునేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ పరిణామంపై భారత్ బయోటెక్ కూడా స్పందించింది.
 
బ్రెజిల్ ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు అమలు చేస్తామని, ఎప్పట్లోగా ఈ పనిచేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. కొవ్యాక్సిన్ కరోనా టీకాను భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పూర్తైన క్లినికల్ ట్రయల్స్‌లో టీకా ప్రభావశీలత 81 శాతంగా ఉన్నట్టు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments