Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 44, 235 కేసులు.. 984 మంది మృతి

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (22:59 IST)
Covid
బ్రెజిల్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో 44,235 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో 984 మంది మృతి చెందారని అధికారులు చెప్పారు. 
 
దీంతో బ్రెజిల్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 37.61లక్షలకు చేరిందని తెలిపారు. అంతేకాకుండా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 1.18లక్షలు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో 29.47లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. బ్రెజిల్‌లో మొదటి కరోనా కేసు.. సావో పాలో రాష్ట్రంలో ఫిబ్రవరి 26న నమోదైంది. అత్యధిక కరోనా మరణాలు ఈ రాష్ట్రంలోనే సంభవించినట్లు అధికారులు తెలిపారు. సావో పాలో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 29,415మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు తెలిపారు.
 
మరోవైపు ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 24,687,652 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 836,893 మంది కరోనాతో చనిపోయారు. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్‌ను దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments