Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కరోనా విజృంభణ.. 424 గంటల్లో 21,641 మంది మృతి

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (17:41 IST)
corona virus
బ్రెజిల్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అక్కడ తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలు గతేడాది మార్చి నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,641 మంది మృతి చెందటమే అందుకు నిదర్శనం. దీంతో దేశంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రమైనట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇటీవల జరిగిన పలు వేడుకలే ఇందుకు కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
దేశంలోని 20 రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో 80శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు దేశంలో కర్ఫ్యూ విధించాలని జాతీయ ఆరోగ్య కార్యదర్శులు పిలుపునిచ్చారు. బ్రెజిల్‌లో కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.57లక్షల మంది మరణించారు. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం బ్రెజిలే కావడం గమనార్హం. మరోవైపు బ్రెజిల్‌ జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ ఏడాది చివరికల్లా అందరికీ టీకా అందించాలని ప్రభుత్వం యత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments