కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (13:10 IST)
దేశంలోనే కరోనా రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ అవతరించింది. కొవిడ్‌-19 బారినపడిన వారిలో చిట్ట‌చివ‌రి ముగ్గురు కోలుకోవ‌డంతో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఆదివారం క‌రోనా వైర‌స్‌లేని రాష్ట్రంగా మారింద‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు. 
 
ఈశాన్య రాష్ట్రం అరుణాచ‌ల్‌లో మొత్తం 16,836 కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు వీరిలో 56 మంది చ‌నిపోగా మిగిలిన 16,780 మంది వ్యాధి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజా కొవిడ్ కేసులేవి న‌మోదు కాలేద‌న్నారు. 
 
ఇదిలావుండగా రాష్ట్రంలో ఇప్పటివరకు 32,325 మంది ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డిమోంగ్ పాడుంగ్ తెలిపారు. ఆరోగ్య శాఖ వారానికి నాలుగు రోజులు - సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం టీకాల డ్రైవ్ నిర్వహిస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments