భారత్‌లో కరోనా దూకుడు, కొత్తగా 85,362 పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:43 IST)
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 59 లక్షల 03 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 85,362 కేసులు నమోదు కాగా 1089 మంది కరోనాతో పోరాడి మరణించారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 93,420 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 59,03,933 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,60,969 ఉండగా 48,49,584 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 93,379 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 82.14 శాతంగా ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో 1.58 శాతానికి తగ్గిన మరణాల రేటు. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 16.28 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,41,535 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.ఇప్పటి వరకు దేశంలో 7,02,69,975 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments