కరోనా భయంతో మేడపై నుంచి దూకేశాడు, ప్రాణాలు కోల్పోయాడు

Webdunia
శనివారం, 2 మే 2020 (20:50 IST)
కరోనా వైరస్ భయంతో మానసిక అందోళన చెందిన ఓ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామంతాపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు విఎస్ అపార్టుమెంటులోని ప్లాట్ నెంబర్ ౩౦౩లో నివసించే వాసిరాజు కృష్ణ మూర్తి (60) కొద్ది కాలంగా గ్యాస్ సమస్యతో అవస్థ పడుతున్నాడు.
 
తరచూ ఆయాసం రావడంతో కరోనా సోకిందేమో అని ఆందోళన చెందాడు. దీనితో కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. 
 
అయినప్పటికీ ఆయన ఆందోళన చెందుతుండటంతో శనివారం గాంధీ అసుపత్రికి వెళదామని కుటుంబ సభ్యులు రెడీ అవుతున్న తరుణంలో అపార్టుమెంటు తన ప్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఉప్పల్ పొలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రి మార్చురీకి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments