Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 8 మంది వైద్యులకు కరోనా... కర్నూలులో 386

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (22:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం కూడా కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, కర్నూలులో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఈ జిల్లాలో ఎనిమిది మంది వైద్యులకు ఈ వైరస్ సోకింది. దీనికితోడు గత 24 గంటల్లో ఈ జిల్లాలో ఏకంగా 43 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుని ఒక్క కర్నూలు జిల్లాలోనే మొత్తం 386 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, ఎనిమిది మంది వైద్యులకు ఈ వైరస్ సోకడం ఇపుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. మరోవైపు, ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ర్యాపిడ్ టెస్ట్‌లను నిర్వహిస్తోంది. అందువల్లే కొత్త కేసులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయనే పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో గురువారం 22 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదైన విషయం తెల్సిందే. గురువారం నమోదైన 22 కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 1038కు చేరింది. అలాగే ముగ్గురు చనిపోగా, ఈ మృతుల సంఖ్య 28కి చేరుకుంది. మరోవైపు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 442కు చేరింది. అంతేకాకుండా, కేసుల కట్టడి కోసం కంటోన్మెంట్ జోన్లపై దృష్టిసారించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments