కరోనా రక్కసికి 798 మంది వైద్యులు బలి

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (13:18 IST)
దేశంలో కరోనా రక్కసికి 798 మంది వైద్యుల్ని బలితీసుకుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) మంగళవారం అందించిన సమాచారం ప్రకారం... రెండో దశలో ఇప్పటి వరకూ దేశంలో 798 మంది వైద్యులు మరణించారు. అత్యధికంగా ఢిల్లీలో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత బీహార్‌లో 115మందిని మహమ్మారి బలితీసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో 79 మంది చనిపోయారు. వీటి తర్వాత స్థానాల్లో బెంగాల్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ విస్తృతంగా పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్రాల్లో 23 మంది, 24 మందిని ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. 
 
పాండిచ్చేరిలో ఒక్కరంటే ఒక్కరే వైద్యులు మృత్యువాత పడ్డారు. కాగా, ఇటీవల మన్‌కీబాత్‌లో పాల్గన్న మోడీ... వైద్యుల సేవలను కొనియాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్‌ జెఎ జయలాల్‌ మాట్లాడుతూ... వైద్యులను గౌరవిస్తామని, రక్షణ కల్పిస్తామని ప్రధాని హమీనిచ్చారని తెలిపారు. కాగా, వైద్యులు చేసిన కృషికి గానూ ప్రతి ఏడాది జులై 1న వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments