Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో పాగా వేసిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లో కరోనా వైరస్ పాగా వేసింది. రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభమయ్యాక విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్కూళ్లు తెరిచి పది రోజులు కూడా గడవక ముందే.. పదుల సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్ బారినపడ్డారు. 
 
పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 మంది విద్యార్థులు, 31 మంది ఉపాధ్యాయులు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అక్టోబరులో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసుల విజృంభణ తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది. 
 
తాజాగా ప్రకాశం జిల్లాలో 14 మంది విద్యార్థులు, 5 ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒంగోలు పట్టణంలో డీఆర్​ఆర్​ఎం ఉన్నత పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు వైరస్ నిర్ధరణ అయింది. పీవీఆర్ బాలికల పాఠశాలలో నలుగురు విద్యార్థులు, రాంనగర్ ప్రాథమిక పాఠశాలలో మరో విద్యార్థికి కరోనా సోకింది. ఉలవపాడు మండలం వీరేపల్లి పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, దర్శి మండలం నిమ్మరెడ్డిపాలెంలో ఓ ఉపాధ్యాయరాలికి కరోనా పాజిటివ్​గా తేలింది.
 
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడంతో ఈనెల 16 నుంచి పాఠశాలలను పునః ప్రారంభమైన విషయం తెల్సిందే. అయితే, పాఠశాలల్లో కరోనా కేసులు క్రమంగా పెరగడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. నాలుగు రోజుల క్రితం కృష్ణా జిల్లా పెద్దపాలపర్రు పాఠశాలలో 13 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. బుధవారం విజయనగరం జిల్లాలో మరో 17 మంది విద్యార్థులకు కరోనా సోకింది. 
 
నెల్లూరు జిల్లాలో 17 మంది ఉపాధ్యాయులు, 10 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. పాఠశాలల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా..విద్యార్థులు వైరస్ బారిన పడటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments