Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకలేదు.. కానీ బ్లాక్ ఫంగస్ సోకింది.. ఎలా?

Webdunia
బుధవారం, 28 జులై 2021 (17:39 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ ఏ రూపంలో దాడి చేస్తుందో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా, కరోనా వివిధ వేరియంట్లుగా రూపాంతరం చెందింది. ఇలాంటి వాటిలో బ్లాక్ ఫంగస్ ఒకటి. ఇది సోకిన బాధితులు ప్రాణగండం నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా వైరస్ సోకకుండానే కొందరికి బ్లాక్ ఫంగస్ సోకింది. 
 
క‌రోనా సెకండ్ వేవ్‌ నడిచిన మొత్తం మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో జైపూర్‌లో 3,471 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోదు కాగా అందులో 477 మందికి అస‌లు క‌రోనా వైర‌సే సోక‌లేద‌ని వెల్ల‌డైంది. అంటే మొత్తం బ్లాక్ ఫంగ‌స్ కేసుల్లో 14 శాతం కేసుల‌కు కరోనా హిస్ట‌రీ లేదన్న‌మాట‌. దాంతో వైద్యులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతుందనే విష‌యంలో స‌మ‌గ్ర అధ్య‌య‌నం జ‌రగాల్సి అవ‌స‌రం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు.
 
మరోవైపు, కరోనా వచ్చి తగ్గిపోయిన డయాబెటిస్ పేషెంట్లలోనే బ్లాక్ ఫంగస్ బయటపడుతోంది. అయితే, తాజా పరిశోధనలో మాత్రం కరోనా వైరస్ సోకకపోయినప్పటికీ బ్లాక్ ఫంగస్ వస్తున్నట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా క‌రోనా సోకిన వ్య‌క్తి డ‌యాబెటిక్ పేషెంట్ అయితే, ఆ వ్య‌క్తిలో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు త‌ప్పుతాయి. దాంతో వ్యాధినిరోధ‌క శ‌క్తి బాగా త‌గ్గిపోయి బ్లాక్ ఫంగస్ అటాక్ అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments