Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజస్థాన్ - మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపాలు ... రిక్టర్ స్కేలుపై...

రాజస్థాన్ - మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపాలు ... రిక్టర్ స్కేలుపై...
, బుధవారం, 21 జులై 2021 (10:27 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్‌ జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైంది. ఈ విషయాన్ని జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం వెల్లడించింది. 
 
బుధవారం ఉదయం 5 గంటల 24 నిమిషాల సమయంలో బికనీర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో 29.19 -అక్షాంశం 70.05- రేఖాంశల నడుమ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపింది.
 
అలాగే, మేఘాలయలోని వెస్టు ఘరోహిల్స్‌ ప్రాంతంలోనూ ఈ ఉదయం 4.1 మేగ్నట్యూడ్‌ తీవ్రతతో భూకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. అయితే, ఈ భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేని ప్రాథమిక వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోటీపడి డ్యాన్స్ చేసిన పాములు