Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,570 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 4,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 30,022మంది వద్ద శాంపిల్స్ సేకరించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 4,570 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, విశాఖలో 1,028, గంటూరులో 368, అనంతపురంలో 347 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఈ వైరస్ నుంచి 669 మంది కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయారు. 
 
స్కూల్ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్... 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువైపోతోంది. దీంతో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అన్ని విద్యా సంస్థలకు ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
ఇదే అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి స్కూల్స్ తెరుచుకుంటాయని చెప్పారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు స్కూల్స్ సెలవులు పొడగించవచ్చన్న వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏమాత్రం నిజంలేదు. యధావిధిగా సోమవారం నుంచి స్కూల్స్ తెరుచుకుంటాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments