Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఫ్యామిలీలో 32 మందికి కరోనా... వైరస్ దెబ్బకు మాజీ మంత్రి మృతి

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (22:14 IST)
కరోనా వైరస్ మహమ్మారి అనేక మంది ప్రాణాలను హరిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ మాజీ మంత్రి చనిపోయారు. ఆయన పేరు మాతంగి నర్సయ్య మృతి చెందారు. హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 
 
కరోనాకు తోడు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తోడవడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. మరో విషాదకర విషయం ఏమిటంటే... ఆయన భార్య బోజమ్మ కూడా 15 రోజుల క్రితం కరోనా కారణంగా చనిపోయారు. రెండు వారాల వ్యవధిలోనే దంపతులిద్దరూ కన్నుమూయడంతో... వారి ఇంట విషాదం నెలకొంది. నర్సయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాతంగి నర్సయ్య మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత నెల 8న మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు, ఉత్తర ప్రదేశ్‌లోని బందా జిల్లా ఫుటా కువాన్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 32 మంది కరోనా బారినపడినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) ఎన్‌డీ శర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన 30 మందికి కోవిడ్ -19 పరీక్ష చేయగా అందరికీ పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన తెలిపారు. 
 
ఫుటా కువాన్‌కు చెందిన 44 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వీరిలో 32 మంది ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. కుటుంబ సభ్యులు వేర్వేరు ఇళ్లలో ప్రత్యేకంగా నివాసం ఉంటుండడంతో వారిని ప్రస్తుతానికి హోం క్వారంటైన్‌లో ఉంచామని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments