మహారాష్ట్ర పోలీస్ శాఖను వణికిస్తున్న కరోనా వైరస్

Webdunia
సోమవారం, 11 మే 2020 (17:27 IST)
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో కరోనా వైరస్‌ దూకుడు అంతా ఇంతా కాదు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ ఒక్క రాష్ట్రంలోనే 30 శాతం కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏమేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే, ఆ రాష్ట్ర పోలీసు శాఖను కరోనా వైరస్ వణికిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 221 మంది పోలీసులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ కేసులతో కలుపుకుని మహారాష్ట్రలో కరోనా వైరస్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 1007కు చేరింది. ఇందులో 106 మంది పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. అంతేకాకుండా, ఈ వైరస్ బారినపడి ఏడుగురు పోలీసులు చనిపోయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. 
 
కాగా, మహారాష్ట్రలో ఏకంగా 22 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇదే అత్యధికం. ఒక్క ముంబై మహానగరంలో ఏకంగా 12 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ముంబై తర్వాత పూణె, థానేలలో అత్యధిక కేసులు నమోదైవున్నాయి. అలాగే, మహారాష్ట్రలో ఇప్పటివరకు 832 మంది ప్రాణాలు విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments