Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకే నుంచి తెలంగాణకు 1216 మంది.. 30మంది జాడ లేదు.. టెన్షన్

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (09:52 IST)
యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఇప్పటివరకు 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం మరో ఇద్దరికి కూడా వైరస్ సోకింది. దీంతో కొత్తగా కరోనాబారిన పడినవారి సంఖ్య ఇరవైకు చేరుకుంది. వీరికి తోడు మరో ముగ్గురు ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. 
 
బ్రిటన్ నుంచి డిసెంబరు 9 తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి మొత్తం 1216 మంది ప్రయాణికులు వచ్చారని, ఇందులో 92 మంది వివిధ రాష్ట్రాలకు చెందినవారు కావడంతో అక్కడికి వెళ్ళిపోయారని, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వివరాలు అందించి అప్రమత్తం చేశామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 
 
అయితే శనివారం వరకూ 184 మంది వివరాలు అందలేదని, అందులో 30 మంది జాడ కనిపెట్టడంతో ఇంకా 154 మంది గురించి వెతుకుతున్నట్లు తెలిపారు. కొత్తగా వైరస్ వచ్చిన ఇద్దరూ మల్కాజిగిరి జిల్లాకు చెందినవారని తెలిపారు.
 
దీంతో ఇప్పటివరకు కొత్తగా వైరస్ బారిన పడిన ఇరవై మందిలో నలుగురు హైదరాబాద్, ఎనిమిది మంది మల్కాజిగిరి, ఇద్దరు జగిత్యాల జిల్లాలకు చెందినవారు కాగా మిగిలినవారు మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందినవారని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments