Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త కరోనా కేసులు 19,412, మృతి చెందినవారు 61

Webdunia
శనివారం, 1 మే 2021 (18:58 IST)
కరోనావైరస్ క్రమంగా చాప కింద నీరులా ఏపీలో విజృంభిస్తోంది. ఈరోజు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 19, 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 61 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 98,214 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలు దాటేసింది. నిన్న ఒక్కరోజే 4,01,993 మందికి పాజిటివ్‌ తేలింది. మరోవైపు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం 3,523 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,11,853కి చేరింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 30 లక్షలు దాటేసింది. ప్రస్తుతం 32,68,710 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,49,89,635 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments