మైదా పిండిలో ఎన్ని విషపూరిత రసాయనాలు ఉంటాయో తెలుసా?

తినుబండరాల తయారీలో మైదాపిండిని తప్పకుండా వినియోగిస్తుంటారు. అలాంటి మైదాపిండిలో ఎన్ని రకాల విషపూరిత రసాయన పదార్థాలు ఉన్నయో తెలుసుకుంటే మాత్రం మీరు ఈ జన్మలో మళ్లీ ఆ పిండిజోలికి వెళ్లరు.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (15:41 IST)
తినుబండరాల తయారీలో మైదాపిండిని తప్పకుండా వినియోగిస్తుంటారు. అలాంటి మైదాపిండిలో ఎన్ని రకాల విషపూరిత రసాయన పదార్థాలు ఉన్నయో తెలుసుకుంటే మాత్రం మీరు ఈ జన్మలో మళ్లీ ఆ పిండిజోలికి వెళ్లరు. 
 
అసలు మైదా పిండి తెల్లగా ఎందుకు ఉంటుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్య పోవాల్సిందే. మిల్లులో బాగా పోలిష్ చేసిన గోధుమ పిండిని అజోడికార్బొనమైడ్, క్లోరిన్ గ్యాస్, బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. ఇందులో బెంజాయిల్ పెరాక్సైడ్ రసాయనాన్ని చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదాలో అల్లోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. 
 
ఇలాంటి మైదా పిండితో తయారు చేసిన వంటకాలను ఆరగించడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.
 
మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 
 
సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది. ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు, ప్రపంచ ప్రసిద్ధి రాజధాని అవుతుందంటూ ఆశాభావం

80 లక్షల ప్యాకేజీ, అమెరికాలో ఇల్లు.. రహస్య వివాహం.. సహజీవన భాగస్వాముల ఆత్మహత్య

కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి దాడి చేసి.. చంపేసింది..

అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

NTR: ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ లో నటించడంలేదంటున్న టోవినో థామస్

Akhil: లెనిన్ తర్వాత అఖిల్ చిత్రం ఎవరితో అనేది క్లారిటీ వచ్చిందా !

స్వర్ణ దేవాలయంలో అంట్లు తోముతున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments