Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి చేపలు కొనాలి? తెలుసుకోవడం ఎలా?

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (18:24 IST)
సహజంగా చేపలను మార్కెట్లలో కొంటుంటాం. కానీ కొన్నిసార్లు కొంతమంది బాగా నిల్వచేసిన చేపలను అమ్ముతుంటారు. అలాంటివి తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. మరి చేపలు తాజాగా వున్నాయని తెలుసుకోవడం ఎలా?
 
చేపలను పట్టే జాలర్ల వద్ద చేపలను కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు చెపుతున్నారు. అలా కాకుండా మార్కెట్లకు వెళ్లినప్పుడు చేపలు తాజాగా వున్నాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. చేపల మొప్పలను తీసి పరిశీలించవచ్చు. అవి ఎర్రగా వుండాలి. అలాగే చేపను చేతితో కాస్త నొక్కి చూస్తే మెత్తగా మీరు వేలు పెట్టినచోట గుంత పడుతుంటే అది బాగా నిల్వ వున్న చేప అని అర్థం చేసుకోవాలి.
 
చేపలు పట్టుకున్న తర్వాత ఐదు రోజులు తినదగినవిగా ఉంటాయి, కానీ అవి తాజాగా రుచిని కోల్పోతాయి. అందుకే చేపలు పట్టుకున్న వెంటనే ఐసులో పెట్టాలి. అలా పెట్టిన చేపలు డెలివరీ ద్వారా మార్కెట్‌కు అలాగే తేబడాలి. అప్పుడే అవి తాజాగా వుంటాయి.
 
ఇకపోతే చేపకు దుర్వాసన తీవ్రంగా ఉంటే అది తాజా చేప కాదు. తాజా చేపలు సముద్రపు నీటి వాసన వస్తుంటాయి. ఈ వాసనతోనే అవి తాజా చేపలను గుర్తించవచ్చు. కనుక ఈ టిప్స్ ద్వారా చేపలను తాజావి కొనుగోలు చేస్తే వండిన కూర కూడా రుచిగా వుంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments