Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కేంద్రంగా మారిన క్లస్టర్.. 66 మంది భారతీయులకు పాజిటివ్

Advertiesment
కరోనా కేంద్రంగా మారిన క్లస్టర్.. 66 మంది భారతీయులకు పాజిటివ్
, శనివారం, 14 నవంబరు 2020 (15:41 IST)
శ్రీలంకకు కరోనా చుక్కలు చూపిస్తోంది. ఇంకా లంకలో నివసించే భారతీయులను కోవిడ్ నానా ఇబ్బందులు పెడుతోంది. తాజాగా శ్రీలంకలో భవన నిర్మాణరంగంలో పనిచేసే 66 మంది భారతీయ కార్మికులు కరోనా బారిన పడ్డారు. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15,722కు చేరితే.. వీటిలో ఒక్క ఈ క్లస్టర్ పరిధిలోనివే 9,120 కేసులు ఉండడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో కొలంబోలో శుక్రవారం కార్మికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మంది భారతీయులకుపాజిటివ్‌గా తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. నార్త్ కొలంబో ప్రాంతంలో నివాసముండే ఈ కార్మికులకు చేపల మార్కెట్ క్లస్టర్ ద్వారా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కొలంబో నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రువాన్ విజేముని తెలిపారు. 
 
ప్రస్తుతం ఈ 66 మంది ధర్గా టౌన్‌లోని తాత్కాలిక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, శ్రీలంకలో ఈ చేపల మార్కెట్ క్లస్టర్ ఇప్పుడు కరోనా కేంద్రంగా మారిందని.. దేశంలో అత్యధిక కేసులు ఈ క్లస్టర్‌తోనే సంబంధం కలిగి ఉంటున్నాయని రువాన్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏం చేసేదీ, రోజూ శృంగారం నావల్ల కావడంలేదన్న భర్త: కోర్టులో విడాకులు కోరిన భార్య