Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళని స్వామి సీటు గల్లంతేనా.. ఎన్నికలపై స్టాలిన్ కొండంత ఆశాభావం

తమిళనాడులో ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా, ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలతో సిద్ధంగా ఉండాలని జిల్లాల కార్యదర్శులకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సూచించారు. పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశం

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (06:01 IST)
తమిళనాడులో ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా, ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలతో సిద్ధంగా ఉండాలని జిల్లాల కార్యదర్శులకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సూచించారు. పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తేనాం పేటలోని అన్నా అరివాలయంలో జిల్లాల కార్యదర్శులతో స్టాలిన్  సమావేశం అయ్యారు. 
 
పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్  సమక్షంలో గంటన్నర పాటుగా జరిగిన ఈ సమావేశానికి ఉప ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎంపీ ఆర్‌ఎస్‌ భారతీ, టీకేఎస్‌ ఇళంగోవన్, సీనియర్లు ఏవీ వేలు, పొను్మడి, ఎంఆర్‌కే పన్నీరుసెల్వంతో పాటుగా వివిధ జిల్లాలకు చెందిన 65 మంది పార్టీ కార్యదరు్శలు హాజరయా్యరు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై స్టాలిన్   సమీక్షించారు.
 
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తగ్గట్టు జిల్లాల్లో నేతలు, కేడర్‌ సిద్ధంగా ఉండాలన్న సూచనలు ఇచ్చారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునే విధంగా అస్త్రాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపై కూడా చర్చించారు. 
 
ఇక, ప్రభుత్వాన్ని కూల్చడం లేదా, అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా జిల్లాలో్లని నేతలకు కొన్ని కీలక పనుల్ని స్టాలిన్  అప్పగించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో స్టాలిన్  మాట్లాడుతూ పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలపై చర్చించామన్నారు. మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చించామని, వాటిని మీడియాకు చెప్పలేమని, చెప్పబోమని వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఆ కీలక నిర్ణయాలు ఏమిటో అన్న చర్చ బయల్దేరింది.
 
డీఎంకేలోకి రాధారవి సినీ నటుడు, అన్నాడీఎంకే నాయకుడు రాధారవి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. స్టాలిన్  సమక్షంలో డీఎంకేలో చేరిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే కనుమరుగైనట్టేనని ప్రకటించారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలన్నా, అన్ని రకాలుగా మేలు కలగాలన్నా డీఎంకే ద్వారానే సాధ్యమని రాధారవి అన్నారు. రాష్ట్రంలో సమర్దుడైన నాయకుడు ఒక్క స్టాలిన్ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.
 
స్థానిక ఎన్నికలు మే 15లోపు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ అప్పీలుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధం అవుతోంది. ముందుగానే మేల్కొన్న డీఎంకే సుప్రీం కోర్టులో మంగళవారం కేవియట్‌ పిటిషన్  వేసింది. ఎన్నికల యంత్రాంగం అప్పీలుకు వస్తే, తమను సంప్రదించాలని ఆ పిటిషన్  ద్వారా విజ్ఞప్తి చేసింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments