Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కుండపోత వర్షం : రెడ్ అలెర్ట్ ప్రకటన

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (15:51 IST)
చెన్నై మహానగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. శనివారం రాత్రి నుంచి ఆదివారమంతా ఈ వర్షం కురుస్తూనేవుంది. దీంతో చెన్నై నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఈ వర్షం ఇంకా మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చెన్నైతో పాటు... కాంచీపురం, తిరువళ్ళూరు, చెంగల్పట్టు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. 
 
అంతేకాకుండా, రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలకు సబ్‌వేలు నీటమునిగాయి. దీంతో అధికారులు సబ్‌వేలను మూసివేసినట్లు తెలుస్తోంది. అటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు.
 
మరోవైపు వరద సహాయక చర్యలకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. చెన్నై, చెంగల్పట్టు జిల్లాలతోపాటు తిరువళ్లూరు జిల్లాలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. దంచికొడుతున్న వానలకు రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. కాగా ఎడతెరిపి లేకుండా పడుతున్న కుండపోత వానలకు పలు జిల్లాలు వణికిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments