జడ్జి ముందే భార్యను కత్తితో పొడిచేశాడు...

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (19:16 IST)
కోర్టులో సాక్షాత్తూ జడ్జి ముందే ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచాడు. ఈ సంఘటన చెన్నై హైకోర్టులో జరిగింది. చెన్నైకి చెందిన శరవణన్‌కి, అతని భార్య వరలక్ష్మికి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. దీనితో వారు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా ఓ కేసు విచారణకు వీరిద్దరూ మంగళవారం ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. 
 
మద్రాస్ హైకోర్టులోని మొదటి అంతస్తులో ఉన్న ఫ్యామిలీ కోర్టులో జడ్జి ముందు విచారణ జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఆవేశానికి లోనైన భర్త శరవణన్ అవతలివైపు ఉన్న వరలక్ష్మి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి, కత్తితో పొడిచేసాడు. 
 
ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన లాయర్లు, అక్కడున్నవారు శరవణన్‌ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడికి గురైన మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments