Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి కూతురు నచ్చలేదు.. కళ్యాణ మండపం నుంచి వరుడు పరార్.. కేసు నమోదు..!

పెళ్లి మండపం నుంచి పెళ్ళి కొడుకు పరారయ్యాడు. ఈ ఘటన చెన్నై రాయపురంలో సంచలనం సృష్టించింది. పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ అమ్మాయి నచ్చలేదంటూ పెళ్లిమండపం నుంచి వరుడు పరారయ్యాడు.

Webdunia
గురువారం, 7 జులై 2016 (10:45 IST)
పెళ్లి మండపం నుంచి పెళ్ళి కొడుకు పరారయ్యాడు. ఈ ఘటన చెన్నై రాయపురంలో సంచలనం సృష్టించింది. పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ అమ్మాయి నచ్చలేదంటూ పెళ్లిమండపం నుంచి వరుడు పరారయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. పాండిదురైకి తిరువొత్తియూరు మురుగప్పానగర్‌కు చెందిన జయంతి (27) అనే యువతితో గత మే నెల 18న నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహ రిసెప్షన్ మంగళవారం రాత్రి రాయపురం కల్యాణమండపంలోనూ, వివాహం బుధవారం ఉదయం వడపళని మురుగన్ ఆలయంలో జరపాలని నిర్ణయించారు. 
 
మంగళవారం సాయంత్రం వివాహ రిసెప్షన్ ఏర్పాట్లు జరుగుతుండగా వరుడు పాండిదురై జంప్ అయ్యాడు. ఆ తర్వాత పాండి దురై కుటుంబీకులు రిసెప్షన్ రద్దు చేసుకున్నట్లు చెప్పడంతో వధువు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. మండపం వరకు వచ్చిన కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందారు.

పాండిదురై కుటుంబీకులతో వధువు తరపు బంధువులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో వధువు కుటుంబీకులు ఎన్నూరు మహిళా పోలీసుస్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పాండిదురై ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments