Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా నెక్ట్స్ 5వ ఎడిషన్‌కు ఎంట్రీలను ఆహ్వానిస్తున్న అల్ట్రాటెక్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (23:25 IST)
గ్రే సిమెంట్, వైట్ సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రటీట్‌కు సంబంధించి భారతదేశ అతిపెద్ద తయారీ సంస్థ అయిన అల్ట్రాటెక్ ఇండియా తన ఇండియా నెక్ట్స్ 5వ ఎడిషన్‌కు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, నిపుణులు, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆహ్వానాలు పంపింది.

 
ఈ ఏడాది ఇండియా నెక్ట్స్ ఇన్షియేటివ్ ‘బిల్డ్ విత్ స్పీడ్’. దేశానికి చెందిన ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు ఒక ప్రాజెక్టును ఎంచుకునేందుకు పోటీ పడుతారు. అది పట్టణ లేదా గ్రామీణ నేపథ్యంతో వినూత్నతతో కూడుకున్నదై, ప్రజలపై ప్రభావం కలిగించేదిగా, భారత్ తన సుస్థిరదాయక అభివృద్ధి ఆశయాలు (ఎస్డీజీ)ను సాధించేందుకు తోడ్పడేదిగా ఉండాలి.

 
అధునాతన సాంకేతికతలు, ప్రక్రియలు, మెటీరియల్స్‌తో ఇంటి నమూనాలను అభివృద్ధి చేయడం ‘బిల్డ్ వి త్ స్పీడ్’ ఆశయం. అది భారతదేశ వృద్ధి గాధను పునర్లిఖించేదిగా ఉండాలి. దేశ గృహనిర్మాణ అభివృద్ధి ప్రాథమ్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో నెరవేర్చేదిగా, దానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేదిగా ఉండాలి. 

 
ఇందులో పాల్గొనే వారు పట్టణ నేపథ్యాన్ని ఎంచుకుంటే వారు వలస కార్మికుల లేదా మురికివాడల్లోని ప్రజల పునరావాసం అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకునే వారు నిరాశ్రయులు లేదా వలస కార్మికుల కోసం ఉద్దేశించిన హౌసింగ్ పరిష్కారాలను వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ నేపథ్యంపై వచ్చే ఎంట్రీలు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ (పీఎంఏవై-జి) వంటి ప్రభుత్వ పథకాలకు లబ్ధి చేకూర్చేలా సామూహిక తక్కువ వ్యయ ఇంటి నిర్మాణాలపై కూడా దృష్టి సారించవచ్చు.

 
ఈ ఏడాది ఎంట్రీలన్నీ కూడా ఆన్లైన్ లోనే ఆమోదించబడుతాయి. విస్తృత శ్రేణికి చెందిన పరామితులతో నిపుణుల కమిటీచే మదింపు చేయబడుతాయి. వేగవంతమైన నిర్మాణం, సృజనాత్మకత, వినూత్నత, ప్రాజెక్ట్ మన్నే కాలం, ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్స్, భారీస్థాయి అమలు, అది కలిగించే ప్రభావం లాంటివి వీటిలో ఉంటాయి.
 
ఎంట్రీల దాఖలుకు చివరి తేదీ: 31 జనవరి, 2022
 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments