Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేడు, రేపు ఐసెట్ - నాలుగు సెషన్‌లలో ప్రవేశపరీక్ష

Webdunia
బుధవారం, 27 జులై 2022 (09:28 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఐసెట్ ప్రవేశ పరీక్షలు బుధ, గురువారాల్లో జరుగనున్నాయి. ఈ రాష్ట్రంలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఐసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. బుధవారం, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజుల పాటు మొత్తం నాలుగు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
 
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు విధిగా ఏదేని గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకుని రావాలని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. గుర్తింపు కార్డులుగా ఆధార్, పాన్, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదేని ఒక కార్డును చూపించాలని కోరారు. 
 
అలాగే, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఖచ్చితంగా గంటన్నర ముందుగా చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఐసెట్ ప్రవేశ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 75958 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరువుతున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments