Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేడు, రేపు ఐసెట్ - నాలుగు సెషన్‌లలో ప్రవేశపరీక్ష

Webdunia
బుధవారం, 27 జులై 2022 (09:28 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఐసెట్ ప్రవేశ పరీక్షలు బుధ, గురువారాల్లో జరుగనున్నాయి. ఈ రాష్ట్రంలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఐసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. బుధవారం, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజుల పాటు మొత్తం నాలుగు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
 
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు విధిగా ఏదేని గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకుని రావాలని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. గుర్తింపు కార్డులుగా ఆధార్, పాన్, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదేని ఒక కార్డును చూపించాలని కోరారు. 
 
అలాగే, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఖచ్చితంగా గంటన్నర ముందుగా చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఐసెట్ ప్రవేశ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 75958 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరువుతున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments