Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ఈసెట్ ఫలితాలు విడుదల : 95.16 శాతం మంది అర్హత

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:48 IST)
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించి ఈసెట్‌-2021 ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 11 సమయంలో వెల్లడించారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదలచేశారు. 
 
పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 95.16 శాతం మిద్యార్థులు అర్హత సాధించారు. ఆగస్టు 3న జరిగిన ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల తమ ర్యాంకు కార్డులను https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 
కాగా, ఈ నెల 24 నుంచి ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. ఆగస్టు 26 నుంచి 29 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఈ నెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. వారికి సెప్టెంబర్ 2న సీట్లు కేటాయిస్తారు. 
 
సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక వచ్చేనెల 13వ తేదీ నుంచి ఈసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 18న స్పాట్‌ అడ్మిషన్స్‌కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments