ఎంపీపీఎస్సీ నుంచి శుభవార్త.. ప్రొఫెసర్ల పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (19:49 IST)
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. వివిధ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 87 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 87 అధ్యాపక ఉద్యోగాల్లో ప్రొఫెసర్‌, రీడర్‌, లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 7వ తేదీ వరకు గడువు విధించింది.  
 
దరఖాస్తు చేసుకునేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవాలని తప్పుగా నింపిన దరఖాస్తులను కమిషన్ పరగణలోకి తీసుకోదని నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడు ప్రక్రియల ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఎంపీపీఎస్సీ తెలిపింది. 
 
ఎంపీపీఎస్సీ వెబ్‌సైట్‌లోని అప్లికేషన్ లింకును క్లిక్ చేయాల్సి వుంటుంది. మొబైల్ నెంబర్‌, ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫామ్‌ను పూర్తిగా ఫిల్ చేయాలి. అనంతరం దరఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments