Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం సీయూఈటీ

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (15:23 IST)
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశానికి సంబంధించి సెంట్రల్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)ను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆరు విడతలుగా నిర్వహించనుంది. యూజీ కోర్సుల కోసం ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 
 
ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగో విడత పరీక్ష జరుగుతుంది. ఇందులో దేశ వ్యాప్తంగా 3.72 లక్షల మంది విద్యార్థులు పాల్గొనున్నారు. అయితే వివిధ కారణాల రీత్యా అనేక పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ రద్దు చేసింది. దీంతో సుమారుగా 11 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దూరం కానున్నారు.
 
వీరిందరికీ ఈ నెల 30 ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. వారంతా తమకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. కాగా, షెడ్యూల్‌ ప్రకారం సీయూఈటీ యూజీ పరీక్షలు ఈనెల 28న ముగియాల్సి ఉన్నది. అయితే తాజాగా చివరిదైన ఆరో విడత పరీక్షలను ఆగస్టు 24 నుంచి 30 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది.
 
ఇప్పటికే రెండో విడత సందర్భంగా కొన్ని పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అదేవిధంగా కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎత్తివేసింది. ఈ కారణంతో పరీక్ష రాయలేకపోయిన వారికి ఈనెల 30 నిర్వహిస్తామని చెప్పింది. వారికి ఆగస్టు 20 తేదీ నుంచి అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments