Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంక్ పరీక్షలన్నీ ఇక తెలుగులో రాసుకోవచ్చు- నిర్మలా సీతారామన్ శుభవార్త

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (12:07 IST)
నిరుద్యోగులు ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్న డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరింది. తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులకు కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఇక బ్యాంక్ పరీక్షలన్నీ తెలుగులోనే రాసుకోవచ్చునని ప్రకటించారు. 
 
ఇందులో భాగంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) కు సంబంధించి స్కేల్‌-1 అధికారులు, కార్యాలయ సహాయకుల పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు చేపట్టే పరీక్షలను ఇకపై ఆంగ్లం, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. ప్రాంతీయ భాషల్లో నైపుణ్యముండే వారు ఉద్యోగం సాధించే విషయంలో ఈ నిర్ణయం బాగా ఉపయోగపడుతుందని ఆమె గురువారం పార్లమెంటులో ప్రకటించారు. 
 
ఇప్పటివరకు ఈ పరీక్షల్ని కేవలం ఆంగ్లం, హిందీల్లో మాత్రమే నిర్వహిస్తుండడంతో స్థానిక భాషల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు నష్టపోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇకపై.. తెలుగు, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూల్లో కూడా నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-8(2019) మెయిన్స్‌ పరీక్ష నుంచి అమలు కానుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments