ఆగస్టు నెలలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష!!

వరుణ్
మంగళవారం, 2 జులై 2024 (11:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆగస్టు నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ను జారీచేసింది. పేపర్-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్-2ఏ స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్-2బీ ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం తదితర వివరాలను నోటిఫికేషన్లో పేర్కొంది. 
 
టెట్ దరఖాస్తు రుసుమును ఈ నెల 3 నుంచి 16 వరకు, దరఖాస్తుల సమర్పణకు 4 నుంచి 17 వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్ నమూనా పరీక్షలకు 16 నుంచి ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 నుంచి హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 10న, తుది కీని 25వ తేదీన విడుదల చేస్తారు. ఆగస్టు 30 టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments