Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 499 వైద్యుల నియామకాలు..

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (14:02 IST)
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో ప్రభుత్వం సేవలను మరింత మెరుగు పర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 499 మంది వైద్యుల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. 
 
ఈ ఉద్యోగాల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లను విడుదల చేశారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీలు, ఇతర వివరాలు జిల్లాల వారీగా వేర్వేరుగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా జిల్లాల వెబ్ సైట్లలో ఆ వివరాలను చూసుకోవచ్చు.
 
కాగా.. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. అయితే పట్టణాల్లోని వివిధ కాలనీల ప్రజలు ఆరోగ్య సమస్యలు తెలెత్తినప్పుడు బోధనాస్పత్రుల వరకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
 
వీరికి వైద్య సేవలు మరింత చేరువ చేసే క్రమంలో ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి వివిధ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రవేశపెట్టనుంది. దీంతో 560 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టరు, స్టాఫ్‌నర్సు, ఏఎన్‌ఎంల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసమే 499 వైద్య నియామకాలను చేపట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం