Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యావసర సరకులు డెలివరీకి జొమాటో స్వస్తి

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:29 IST)
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ డెలివరీ కాలం సాగుతోంది. ఏది కావాలన్న ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే చాలు ఇంటికి వచ్చేస్తుంది. కాగా ప్ర‌ముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ జోమాటో మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నిత్య‌ావ‌స‌ర వ‌స్తువుల డోర్ డెలివ‌రీ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుంది. 
 
క‌రోనా నుంచి కోలుకుంటుండ‌టంతో ఫుడ్ డెలివ‌రీకి డిమాండ్ పెరుగుతుంది. నిత్య‌ావ‌స‌ర వ‌స్తువుల డోర్ డెలివ‌రీ కంటే, ఫుడ్ డెలివ‌రీకే వినియోగ‌దారులు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో నిత్య‌వ‌స‌ర సేవ‌ల డోర్ డెలివ‌రీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ సేవలను ఈ నెల 17వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 
 
గ‌తేడాది ఓసారి ఈ నిర్ణ‌యం తీసుకోగా, జులై నెల‌లో ఈ సేవ‌ల‌ను తిరిగి ప్రారంభించింది. అయితే, ఇప్పుడు ఫుడ్ డెలివ‌రీకి డిమాంట్ పెరుగుతున్న నేప‌థ్యంలో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల సేవ‌ల‌నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది.
 
తమకు ఆర్డర్లు వస్తున్నంత వేగంగా సరుకులు అందించలేకపోతుండడంతో అప్పట్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎంపిక చేసిన నగరాల్లో మాత్రం ముప్పావుగంటలోపే నిత్యావసర సరుకులు అందిస్తామంటూ ఈ ఏడాది జులైలో మళ్లీ ప్రకటించింది. 
 
ఇప్పుడు మరోమారు ఆ సేవల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. కాగా, నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో జొమాటో దాదాపు రూ.745 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments