బంగారానికి రసీదు అడిగిన అధికారి చెంప ఛెల్లుమంది.. ఎలా?

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (14:01 IST)
విదేశాల నుంచి భారత్‌కు అక్రమంగా బంగారం రవాణా అవుతోంది. విహార యాత్రల పేరిట విదేశాలకు వెళ్ళిన స్మగ్లర్లు.. విదేశాల్లో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి భారత్ లోకి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళిన సమయంలో భారతీయులు భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడంతో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కొందరు మహిళలు బిల్లు అడిగితే అధికారుల మీద దాడి చేసారు. దుబాయ్ నుంచి స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో అహ్మదాబాద్‌కు వచ్చిన కొందరు భార్యాభర్తలను తనిఖీ చేయగా వారి వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉంది. వాటికి సంబంధించిన బిల్లులు చూపించాలని మహిళలను అడగగా వారు ఏకంగా కస్టమ్స్ అధికారి చెంపఛెల్లుమనిపించారు. 
 
ఇక వెంటనే భర్తలతో కలిసి విమానాశ్రయంలో కుర్చీలు ఫర్నీచర్ నాశనం చేస్తూ గలాటాకు దిగారు. ఇక అక్కడికి మీడియా వెళ్లి చూడగా అధికారులు స్పందిస్తూ తాము బంగారానికి రశీదులు అడిగితే తమ మీద దాడికి దిగారని వాపోయారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

Kiran Abbavaram: K-ర్యాంప్ కలెక్షన్ల కంటే ఆడియెన్స్ నవ్వులే నాకు సంతృప్తి : కిరణ్ అబ్బవరం

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments