Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ అకౌంట్ కలిగివున్నవారు.. ఆదివారం జాగ్రత్త.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 3 జులై 2021 (13:17 IST)
ఎస్బీఐ అకౌంట్ కలిగివున్నవారు.. ఆదివారం జాగ్రత్త. ఎందుకంటే కొన్ని గంటల పాటు ఈ సేవలకు అంతరాయం కలుగనుంది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, ఆయా సేవలను అప్ గ్రేడ్ చేయాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది. దీంతో అంతరాయం కలుగనుందని వెల్లడించింది. బ్యాంకింగ్ సేవలకు 2021, జూలై 04వ తేదీ ఆదివారం అంతరాయం కలుగనుంది.
 
బ్యాంకుకు సంబంధించి నిర్వహణ పనుల నేపథ్యంలో బ్యాంకు డిజిటల్‌ చెల్లింపుల వేదికలైన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యూపీఐ తదితర సేవలు ఆదివారం కొన్ని గంటల పాటు పరిమిత సయమంలో నిలిచిపోనున్నాయి. 
 
ఆదివారం మధ్యాహ్నం 03 గంటల 25 నిమిషాల నుంచి 05 గంటల 50 నిమిషాల వరకు డిజిటల్‌ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని బ్యాంకు తెలిపింది. ఈ విషయంలో ఖాతాదారులు సహకరించాలని సూచించింది. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్ అని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments